సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట జరుగుతున్న నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బాధితులందరూ ఏకమై శాంతియుతంగా కూర్చొని తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన తెలుపుతున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.రెండో రోజు దీక్షలో అంజయ్య, అనిల్, అంబటి రాజశేఖర్, ఉస్మాన్, షేక్ బాబర్, ఓం ప్రకాష్, తిరుమల శ్రీనివాస్, రంజిత్, హాకుల రవి, సమ్మయ్య, కొలిపాక అన్వేష్, ముద్దుకూరి రవికుమార్, దొడ్ల కుమార్, రామిళ్ల సందీప్, లక్క శ్రావణ్ గౌడ్, దన్నడ రాజు, డిష్ బాబు, దీపిక, కొమురమ్మ తదితరులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. బాధిత కుటుంబాలంతా ఐక్యంగా నిలబడి రెండో రోజు నిరసన దీక్షను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.



