Aug 08, 2026,ప్రైవేటు స్కూళ్లు లెక్కలివ్వవు.. విద్యాశాఖ షోకాజ్ నోటీసులు
తెలంగాణ : రాష్ట్రంలోని 13,245 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఆడిట్ రిపోర్టులు సమర్పించకుండా తప్పించుకుంటున్నాయి. ఫీజుల దందాను దాచిపెట్టేందుకే ఈ రిపోర్టులు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 16 స్కూళ్లు మాత్రమే లెక్కలు సమర్పించడంతో, విద్యాశాఖ సీరియస్ అయింది. లెక్కలు ఇవ్వని 13,229 స్కూళ్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల వివరాలను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని కూడా సూచించారు.



